చండీఘడ్: లోక్సభలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును రూపొందించినట్లు ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్రాల రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కక్షపూర్తి డిజైన్తో కేంద్రం.. ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకునేందుకు అన్ని రాష్ట్రాలు పోరాటం చేయనున్నట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు. విద్యుత్తు రంగానికి చెందిన ఎటువంటి బిల్లునైనా రూపొందించే సమయంలో రాష్ట్రాలను కేంద్రం సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. సంప్రదించకుండానే బిల్లును రాష్ట్రాలపై రద్దుతున్నట్లు సీఎం మాన్ ఆరోపించారు. నివాసాలకు రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్తును సరఫరా చేస్తున్న సమయంలో.. మరి కొత్త బిల్లు కోసం ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకోలేదని ప్రశ్నించారు. పంజాబ్లో రైతులకు, ఇంటి వినియోగదారులకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, ఒకవేళ బిల్లును ఆమోదిస్తే అప్పుడు రైతులతో పాటు ఇతర వర్గాల వారికి నష్టం జరుగుతుందని సీఎం మాన్ తెలిపారు.