అమరావతి : టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు దుబాయి వేదికగా భారత్ – పాక్ మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. ఇరుదేశాల రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ పోటీకి దిగుతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలో ఈ మ్యాచ్పై విపరీతంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఏపీలోని విశాఖపట్నంలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాధవధారలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు దాడి జరిపి.. బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ చెక్బుక్స్, ఏటీఎం కార్డులతో పాటు రూ.88వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ వెనుకాల మరికొంత మంది వ్యక్తులు ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపాయి.