సూరత్, మే 1: భవబంధాలను త్యజించి, సర్వసుఖాలను వదులుకుని సన్యాసిగా మారి భిక్ష పాత్రతో జీవించడం ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెంగళూరుకు చెందిన ఓ జైన వ్యాపారవేత్త భార్య, తన 11 సంవత్సరాల కుమారుడితో కలిసి సన్యాసం స్వీకరించేందుకు సర్వాన్నీ త్యాగం చేశారు.
నిజానికి జైన మతంలో సన్యాసి జీవితాన్ని ఎంచుకోవడం అత్యంత గౌరవప్రదమైన నిర్ణయం. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇలా సర్వసుఖాలను తృణప్రాయంగా వదులుకుని సన్యాస జీవితంలోకి మారిపోయారు. తాజా విషయానికి వస్తే ఆమె పేరు స్వీటీ. వయసు 30 ఏళ్లు. తన 11 ఏళ్ల కుమారుడు హృదన్తో కలిసి సన్యాసం స్వీకరించారు.