ఆర్మూర్టౌన్, మే 24: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం తెరిచారు. బకాయిలు చెల్లించలేదని పేర్కొంటూ ఈ నెల 16న ఆర్టీసీ జీవన్రెడ్డి మాల్ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న విష్ణుజిత్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్కు లిమిటెడ్ పేరు మీద ఆశన్నగారి రజితారెడ్డి మాల్ సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో బకాయిలు కట్టేందుకు గడువు ఇచ్చి మాల్ను తెరవాలని న్యాయస్థానం ఆదేశించింది. వారం రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే మళ్లీ స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు, న్యాయం గెలిచిందంటూ జీవన్రెడ్డి అనుచరులు సం బురాలు జరుపుకొన్నారు.