Naveen Patnaik | అనారోగ్యం, వృద్ధాప్యంతో ఉన్నందున తనకు విశ్రాంతి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ప్రస్తుత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నానని కూడా శుక్రవారం పేర్కొన్నారు. ఆరోగ్యం, వృద్ధాప్యం వల్ల ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్కు విశ్రాంతి ఇవ్వాలంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు చేస్తున్న అబద్దాల ప్రచారానికి ఓ హద్దు ఉండాలన్నారు. తాను ఆరోగ్యంతో నెలల తరబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీడియో సందేశాలు విడుదల చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు తమ సొంత ఇంటెలిజెన్స్ వాడాలని హితవు చెప్పారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బిజూ జనతాదళ్ నేత వీకే పాండ్యన్ కూడా మాట్లాడుతూ ప్రజాదరణ గల ఒక సీఎంను కించ పర్చడాన్ని రాష్ట్ర ప్రజలు హర్షించరని వ్యా్ఖ్యానించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు దురదృష్టకరం అని చెప్పారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లు బీజేడీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం నవీన్ పట్నాయక్ను దూషించడం వల్ల తమ పార్టీ ఓట్ల శాతం పెరగడానికే ఉపకరిస్తుందన్నారు.