కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ మాత్రమే వర్సిటీలకు ఛాన్సలర్గా ఉంటారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో ఇక నుంచి మమతా బెనర్జీయే ఛాన్సలర్గా ఉండనున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో విజిటర్ హోదాలో ఉండే గవర్నర్ను కూడా తొలగిస్తూ.. ఆ అవకాశాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలకు కూడా మమతానే ఛాన్సలర్గా ఉంటారని క్యాబినెట్ తీర్మానించింది. అయితే జూన్ 10వ తేదీ నుంచి జరగనున్న వర్షాకాల సమావేశాల్లో తాజా ప్రతిపాదనను బిల్లుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.