కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టోలిగంజ్లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజలో కొనసాగుతున్నాయి. 9,900 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో అసన్సోల్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో ఆయనను బీజేపీ టోలిగంజ్ సీటు నుంచి పోటీలో దింపింది. 2014లో ఎన్నికల్లో అసన్సోల్ సీటు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో.. తిరిగి 2019లో కూడా గెలిచారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో బాబుల్ సుప్రియో పట్టణాభివృద్ధి శాఖ, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండోసారి సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.