పోలీస్ విభాగంలో ఐదు వేల పోస్టుల స్థానంలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పోలీస్ నిరుద్యోగులు .. శనివారం మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరుబాట ఆగదంటూ దిల్సుఖ్నగర్లో ఆందోళనకు దిగారు. అధికారికంగా తమ ఉద్యోగాల ప్రకటన వచ్చేదాక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామన్నారు. నిరసనలో తెలంగాణ పోలీస్ జేఏసీ నాయకులు నవీన్ పట్నాయక్, ఇంద్రానాయక్, భూక్యా కుమార్, ఆకాష్, శంకర్, శింబు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
– ఎల్బీనగర్, జూన్ 13