రాజన్న సిరిసిల్ల, మే 23 నమస్తే తెలంగాణ : సిరిసిల్లలో నిర్మిస్తున్న బస్తీ దవఖానాను జూన్ 2 లోగా అందుబాటులోకి తేవాలని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్లో ఆర్థిక సంఘం నిధులు రూ.13 లక్షలతో నిర్మిస్తున్న బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో బస్తీ దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినందున మిగతా పనులు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఏఈఈ వరుణ్ తదితరులు ఉన్నారు.