సమైక్య పాలనలో మూగబోయిన మరమగ్గానికి సంక్షేమ పథకాలతో ఊపిరిలూదిన సర్కారు..తాజాగా ఇక్కడి సమైక్య సంఘాల మహిళలకు పాడి గేదెలివ్వాలని నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కీంను అమలు చేయనున్నది. రూ. 40 కోట్లతో 2000 మంది దళితబిడ్డలకు ఒక్కో గేదెకు రూ. 85, 200 చొప్పున రుణం ఇవ్వనుండగా ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మహిళలు అర్థికంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది. సమైక్య మహిళలకు పాడిగెదెలిచ్చి క్షీర విప్లవానికి శ్రీకారం చుట్టింది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమ లు చేస్తుండగా 2000 మంది దళితులకు రూ. 40 కోట్లతో పాడి గేదెలు ఇస్తున్నది. ఆమాత్యుడి ఆదేశాలతో జిల్లాలో పైల్ ప్రాజెక్టు కింద ప్రతి సభ్యురాలికి స్త్రీనిధి కింద పాడిగెదెకు రూ. 85, 200ల చొప్పున రుణం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది.
వస్ర్తోత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా క్షీర విప్లవం దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే అప్పారెల్ పార్కు ఏర్పాటు చేసి 15వేల మం ది మహిళలకు ఉపాధి కల్పించారు. గ్రామైక్య సం ఘాల మహిళలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుంటూ వివిధ వ్యా పారాలు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నా రు. ఈనేపథ్యంలో మహిళలకు పాడిగేదెలు ఇచ్చి పాల ఉత్పత్తిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 40కోట్లతో రెండువేల మంది దళితులకు పాడిగెదెలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. దాదాపు 550ల మందిని ఎంపిక చేశారు.
తక్కువ వడ్డీతో రుణాలు..
స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ తో గ్రామైక్య సంఘ సభ్యులకు పాడి గేదెలు ఇవ్వనున్నారు. ఒక్కో మహిళకు రూ. 85,200 చొప్పున రుణం మంజూరు చేస్తారు. మొదటి విడుతలో 550 మందికి రూ. 5కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించగా, అందులో 30 మంది ఆసక్తి చూపిన సభ్యురాళ్లకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ముస్తాబాద్, చందుర్తి, ఇల్లంతకుంట మండలాలకు చెందిన లబ్ధిదారులు నెల కిందనే పాడిగేదెలు తెచ్చుకున్నారు.
నేరుగా కొనుగోలు..
ఈ స్కీం అమలులో దళారీ వ్యవస్థ లేకుండా చర్య లు తీసుకున్నారు. ఆంధ్రా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నుంచి స్వయంగా మహిళలే పాడిగేదెలు, ఆవులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. తీసుకున్న రుణం నాలుగేళ్ల లోపు కట్టుకునే అవకాశం ఇచ్చారు. గేదెకు, రుణం తీసుకున్న స భ్యురాలికి రూ. 5,088 బీమా సౌకర్యం ఉంటుం ది. గేదెను ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చేటపుడు రవాణా ఖర్చులకింద రూ. 443 చెల్లిస్తారు. గేదెగాని, సభ్యురాలు గాని మరణిస్తే తీసుకున్న రుణం మాఫీ అవుతుంది.
జిల్లాలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ..
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట వుతున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండలం నర్మాలలో 250 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. అలాగే గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో మినీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పాల ఉత్పత్తికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతగానో దోహదపడుతాయని భావిస్తున్నారు. రెండువేల మంది దళితులకు, 550 మంది సభ్యులకు పాడిగేదెలు ఇవ్వ డం ద్వారా వివిధ రకాల పాల ఉత్పత్తులు తయా రు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో గతంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉండే ది. రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తిలో అగ్రస్థానం లో నిలుపాలన్న లక్ష్యంతో మంత్రి ఆదేశాల మేర కు అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకుపోతున్నారు.
ఉపాధి, పాల ఉత్పత్తి పెంపే లక్ష్యం
గ్రామైక్య సంఘాల మహిళలకు ఉపాధి క ల్పించడమే కాకుండా, పాల ఉత్పత్తిలో జిల్లా ను అగ్ర భాగాన నిలుపాలనే లక్ష్యంతో ముం దుకెళ్తున్నాం. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యం లో ఈ స్కీం కింద లబ్ధిదారులను ఎంపిక చే స్తాం. గేదెలు, ఆవులు ఎక్కడినుంచైనా కొనుగోలు చేసుకునే అవకాశం వారికే కల్పించాం.