పోర్ట్ఎలిజబెత్: క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించిన కారణంగా బంగ్లాదేశ్ పేసర్ ఖలీద్ అహ్మద్కు జరిమానా పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఖలీద్ ఉద్దేశపూర్వకంగా బంతిని బ్యాటర్పై విసిరాడు. తోటి ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా మ్యాచ్ రిఫరీ, అంపైర్ ఖలీద్పై చర్యలు తీసుకున్నారు. జరిమానాగా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. 332 పరుగుల తేడాతో విజయం సాధించిన సఫారీలు 2-0తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్నారు.