రామంతాపూర్, నవంబర్ 19 : రామంతాపూర్ టీవీ కాలనీలో బాలకృష్ణగురుస్వామి, తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. కార్యక్రమం వందలాది మంది అయ్యప్పస్వాముల భజనలు, అర్చనల మధ్య కన్నుల పండుగగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 రోజుల కఠోర దీక్షతో అయ్యప్పస్వాములు తమ అయ్యప్ప స్వామిని కొలుస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.