చర్లపల్లి, డిసెంబర్ 27 : ఏఎస్రావునగర్ డివిజన్లోని కమలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలానగర్ ప్రధాన రహదారి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని గురుస్వాములు, భక్తులు ఉరేగించారు. ఉరేగింపు సందర్భంగా చిన్నారులు, మహిళలు సంప్రదాయ వేషధారణ, మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. మండల పూజ సందర్భంగా కేరళ సంప్రదాయం పద్ధతిలో దీపాలు, కావడిలతో స్వాములు నృత్యాలు చేస్తూ .. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు ఎస్ఆర్.నారాయణ, జయరా జు, రమేశ్, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.