Awareness on EVs | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎలక్ట్రికల్ వెహికిల్స్ వాడకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పనకు ఆదివారం హైదరాబాద్లో ట్రైడ్ మొబిలిటీ `ఈవీ రైడ్ విత్ ప్రైడ్` ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీ-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. `ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పుడు స్థిరంగా ఉండబోతోంది. ఇది రవాణా రంగ భవిష్యత్ను సూచిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల, స్థిరమైన రవాణా మార్గం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత సమర్థవంతంగా వినియోగంలోకి తె స్తుంది. టీ-హబ్లో ఇంక్యుబేట్ అయిన స్టార్టప్ `ట్రైడ్ మొబిలిటీ` టెక్నాలజీ ఆధారిత ప్లాట్ ఫారం ద్వారా పరిశుభ్రమైన రవాణా మార్గాల ప్రోత్సాహానికి దోహదపడుతుంది` అని చెప్పారు.
ట్రైడ్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు కం సీఈవో మాధవ్ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. `స్వచ్ఛ రవాణా అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభిన్న ఈవీ బ్రాండ్ల నుంచి సమిష్టి భాగస్వామ్యం, సహకారాన్ని మేం చూశాం. మా ఈవీ రైడ్స్ బీ2బీ ఎస్ఏఏఎస్ ప్లాట్ ఫారం ద్వారా, ఓఏఎంలు, ఈవీ ఛానల్ భాగస్వాములకు వారి కస్టమర్ల ప్రయాణాన్ని డిజిటలైజేషన్తోపాటు వారి ఎండ్-టు-ఎండ్ సప్లై చైన్ కార్యకలాపాల నిర్వహణకు మేం సాధికారతను కల్పిస్తున్నాం. మేము ప్రస్తుతం మా ఎండ్-టు-ఎండ్ ఎస్ఏఏఎస్ పరిష్కారాలను అందించే ఈ రంగంలో 15కి పైగా బ్రాండ్లతో పని చేస్తున్నాం` అని తెలిపారు.
ట్రైడ్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు కం సీఓఓ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. 75 ఏండ్ల క్రితం బ్రిటిష్ పాలకుల నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. కాలుష్యం నుంచి స్వేచ్ఛ, స్వాతంత్య్రం పొందడానికి, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడేందుకు మనమంతా ఏకం కావాల్సిన సమయం ఇది. 2030 నాటికి స్వచ్ఛ ఇంధనాల వాడకంతో పర్యావరణంలో 45 శాతం కర్భన ఉద్గారాల తీవ్రతను తగ్గించొచ్చు. కస్టమర్లు మరింత ఆత్మ విశ్వాసంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరింత సులభంగా వాడటానికి, ఈవీ వ్యవస్థ డిజిటలైజేషన్ కోసం, సరళతరం కోసం ట్రైడ్ మొబిలిటీలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాం` అని చెప్పారు.
ఈ అవగాహన ర్యాలీలో 15కి పైగా ప్రముఖ ఈవీ టూ-వీలర్స్ బాండ్ల నుంచి 50 మందికి పైగా రైడర్లు పాల్గొన్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి 10 కి.మీ దూరం ప్రయాణించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాలు అందిస్తాయని సందేశాన్నిచ్చారు. రైడర్లు ఎలక్ట్రికల్ వెహికల్స్పై అవగాహన కల్పించడానికి వివిధ రకాల సందేశాలతో కూడిన ప్లకార్డులు, జాతీయ పతాకాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవన నాణ్యతను ఎలా మెరుగు పరుస్తుంది, రాబోయే తరాలకు ఎలా స్థిరమైన మార్గం సుగమం చేస్తుందన్న విషయంతోపాటు ప్రజల్లో దేశభక్తి భావనను ప్రోత్సహించింది.