ఖైరతాబాద్, నవంబర్ 23 : సైబర్ నేరాలు…మహిళల భద్రతపై రాజ్భవన్ స్కూల్ 8, 9, పదో తరగతి విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన షీటీమ్స్ ఎస్సై ముఖీద్ సైబర్ నేరాలపై వివరిస్తూ ఫేక్ మ్యాట్రీమోని, ఓఎల్ఎక్స్లో వాహనాలు, లాటరీ, లోన్స్తో పాటు వ్యక్తిగత పిన్నంబర్లు, ఓటీపీలు అడిగి అడ్డంగా దోచుకుంటారని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు పెరిగిపోయాయన్నారు. విద్యార్థ్ధి దశ నుంచే దీనిపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమకు తెలిసినవారందరికీ వివరించాలన్నారు. అలాగే ఆడపిల్లల పట్ల పనిచేస్తున్న, ఇతర చోట్ల వేధింపులు, ఈవ్ టీజింగ్, ఫొటో మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్ లాంటి నేరాలు జరుగుతున్నాయని, అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు వెంటనే డయల్ 100కు ఫొన్ చేయాలని, షీటీమ్స్కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం పీర్కొండ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న పాల్గొన్నారు.