సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
దామరగిద్ద, నవంబర్ 23: మండలంలోని కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులకు సైబర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీసీడీవో పద్మ, ఎస్సై గోవర్ధన్ హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ పావని మాట్లాడుతూ బ్యాంక్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నేరాలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. అప్రమత్తంగా ఉంటూ వీటిని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, నవంబర్ 23: మహిళలకు చట్టాలపై కనీస అవగాహన ఉండాలని ముఖ్యంగా పాఠశాల, కళాశాల బాలికలకు పోలీసు వ్యవస్థపై తెలిసి ఉండాలని ఇన్చార్జి ఎస్సై మురళీ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు అనేక చట్టాలున్నాయన్నారు. జిల్లాలో ఎస్పీ డాక్టర్ చేతన ఆదేశాలతో ‘నీ నేస్తం’ కార్యక్రమం చేపట్టామన్నారు. పాఠశాలలు, బస్టాండ్, జనం గుమిగూడే ప్రదేశాల్లో నీనేస్తం డబ్బాలు ఉంచామన్నారు. అల్లరిమూకల నుంచి సమస్య ఉంటే ఫిర్యాదు రాసి డబ్బాలో వేసినా, నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయులు రాజేందర్రావ్, రవీందర్రెడ్డి, కృష్ణగౌడ్, రవిప్రకాశ్ ఉన్నారు.
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
ఊట్కూర్, నవంబర్23: సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తగా మెలగాలని ఎస్సై పర్వతాలు సూచించారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే జీవితం ప్రమాదంలో పడడం ఖాయమని హెచ్చరించారు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన పాఠశాలల్లో సైబర్ అంబాసిడర్ బ్యాచ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్నాథరావు, ఎస్ఎంసీ చైర్మన్ సిద్ధప్ప, ఏఎస్సై సురేందర్, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, నర్సింహ, భాస్కర్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ జాగ్రత్తపడాలి
మాగనూర్, నవంబర్ 23: మాగనూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సైబర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గణేశ్సింగ్, ఎస్సై శివనాగేష్ నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అదుపు చేయడానికి ప్రతి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. వారు యూనిఫాం లేని సైబర్ పోలీస్ అధికారులుగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుయుడు నర్సింహులు, కేజీబీవీ ప్రధానోపాధ్యాయురాలు రాధిక, కానిస్టేబుల్ పుష్ప, రాజు తిమ్మప్ప, పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, నవంబర్ 23: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఈవో గోవిందరాజులు, ఎస్సై రాజేందర్ అన్నారు. మంగళవారం ధన్వాడలోని బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీహెచ్ఎం రమేశ్తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
నర్వ, నవంబర్ 23: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఎస్సై విజయ్భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మంగళవారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరైన వేధింపులకు గురిచేస్తే 100కు డయల్ చేయడంతోపాటు ‘నీ నేస్తం’ పెట్టెలో విద్యార్థులు తమ ఫిర్యాదులు వేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతోపాటు, ఏఎస్సై రాజేశ్, కానిస్టేబుల్ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
గార్లపాడ్,కోయిలకొండలో..
కోయిలకొండ, నవంబర్ 23 : మండలంలోని గార్లపాడ్,కోయిలకొండ ఉన్నత పాఠశాలలో సైబర్ భద్రతపై సురక్ష పోలీస్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వెంకట్జీ, మదన్మోహన్రెడ్డి, ప్రత్యేకాధికారులు ఉమాపతిరెడ్డి, శంకరయ్య, సర్పంచ్ ఆంజనేయులు, పోలీసులు రజిత, శ్రీనివాసులు పాల్గొన్నారు.
బాల్యం నాశనం చేసుకోవద్దు
భూత్పూర్, నవంబర్ 23: విద్యార్థులు సైబర్ నేరాలకు బలికావొద్దని మండల విద్యాధికారి నాగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని తాటికొండ, తాటిపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంలు శంకరాచారి, వెంకటమ్మ, పీఈటీ నిరంజన్, కానిస్టేబుళ్లు ఆనంద్, నవీన్, సీఆర్పీలు ఇక్రాం, పాల్గొన్నారు.
యూప్ల ద్వారా..
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 23: సెల్ఫోన్లో అనవసరమైన యూప్లను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సైబర్ నేరాలకు అవకాశం ఉంటుందని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. మంగళవారం అడ్డాకుల, కందూరు, రాచాల గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, బాలయ్య, బానుకుమారి పాల్గొన్నారు.
మూసాపేటలో..
మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్సై నరేశ్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ తిరుపతయ్య పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన ఉండాలి
రాజాపూర్, నవంబర్ 23: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కల్గి ఉండాలని కానిస్టేబుళ్లు కృష్ణారెడ్డి, హరిప్రసాద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు, తిర్మలాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సుందర్పాల్, ఆనంద్కుమార్ పాల్గొన్నారు.
యన్మన్గండ్లలో..
నవాబ్పేట, నవంబర్ 23: మండలంలోని యన్మన్గండ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎం దశరథ్నాయక్, పోలీస్ సిబ్బంది మజారుద్దీన్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.