న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఆటోను బుకింగ్ చేసుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరింత చిల్లులు పడబోతున్నది. వచ్చే జనవరి 1 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కింద ఆటో బుకింగ్ చేసుకున్న వారిపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండటమే ఇందుకు కారణం. కానీ, ఆఫ్లైన్, మాన్యువల్ పద్దతిన ఆటోలను బుకింగ్ చేసుకున్న వారికి జీఎస్టీపై మినహాయింపునిచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కింద ప్రయాణికుల రవాణా సదుపాయాలకోసం వినియోగించే ఆటో రిక్షలపై జీఎస్టీ మినహాయింపునిస్తూ ఈ నెల 18న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను వెనక్కితీసుకున్నది.