అమరావతి : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామశివారులో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. జింజేరు గ్రామానికి చెందిన 12 మంది కూలీ పనుల నిమిత్తం వడ్లమన్నాడు గ్రామానికి ఆటోలో బయల్దేరారు.
గ్రామశివారులో డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ టీ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.