గండీడ్/మహ్మదాబాద్, నవంబర్ 24 : అధికారులు ప్రజా సమస్యలపై దృ ష్టి సారించి పరిష్కరించాలని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నా రు. బుధవారం గండీడ్లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు నిర్ల క్ష్యం చేయొద్దన్నారు. విద్యుత్ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, అ ధికారులు వెంటనే వాటిని పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాప్రతినిధు లు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేయాలని కోరారు. కాగా, సమావేశానికి పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు హాజరైతే సమస్యలు పరిష్కారమవుతాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఎంపీడీవో రూపేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.