-పాక్పై మూడో టెస్టులో అద్భుత విజయం
లాహోర్: రసవత్తరంగా జరిగిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయంతో టెస్టు సిరీస్ను 1-0తో వశం చేసుకుంది. మూడో టెస్టులో శుక్రవారం ఆఖరి రోజు పాకిస్థాన్ను కుప్పకూల్చి 115 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన ఆఖరి రోజు పాకిస్థాన్ ఓవర్ నైట్ స్కోర్ 73/0తో మైదానంలోకి దిగగా.. 235 పరుగులకు కుప్పకూలింది. ఇమామ్ ఉల్ హక్ (70), బాబర్ ఆజమ్ (55) గొప్పగా పోరాడారు. తక్కినవాళ్లంతా నామమాత్రపు స్కోర్ చేయడంతో పాకిస్థాన్ సిరీస్ను చేజార్చుకుంది. నాథన్ లియాన్ (83/5), పాట్ కమిన్స్ (23/3) బౌలింగ్తో విజృంభించారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 391 పరుగులు చేయగా.. పాక్ 268 రన్స్ చేసింది. 123 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్ను 227/3 వద్ద డిక్లేర్ చేసింది. 351 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 235 పరుగులకే పరిమితమైంది. తొలి, రెండో టెస్టుల్లో గొప్పగా పోరాడి ‘డ్రా’గా మలిచిన పాక్ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లోనూ పోరాటం కనబర్చింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఈనెల 29న మొదలుకానుంది.