హైదరాబాద్, మే 11: రాష్ర్టానికి చెందిన మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.3,179 కోట్ల ఆదాయంపై రూ.243.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ విషయానికి వస్తే రూ.3,492 కోట్ల ఆదాయంపై రూ.242.13 కోట్ల లాభం వచ్చింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10,038 కోట్ల ఆదాయంపై రూ.490.12 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. ఆర్థిక ఫలితాలవిడుదల సందర్భంగా బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.2 విలువైన షేరు లేదా 100 శాతం డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ చేతిలో 36 వేల కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.