అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది . దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబంలో విషాదం నిండుకుని ఉంది. ఏలూరులోని కట్టా సుబ్బారావు వీధిలో నివాసముంటున్న భర్త మెహర్ బాబా, భార్య విజయలక్ష్మి దంపతులు ఇవాళ తెల్లవారుజామున ఒకేతాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.