మనోహరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామకమిటీ నియామక పత్రాలను మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, జడ్పీటీసీ రాణీసత్యనారాయణ శుక్రవారం ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో యువకులు, వృద్ధులు, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గ్రామాల్లో ఏ గడప తొక్కిన కల్యాణలక్ష్మితో ఇంటికి పెద్దన్నగా, వృద్ధాప్య పింఛన్తో పెద్దకొడుకుగా, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయంలో రైతులకు ఆసరాగా, కులవృత్తుల వారికి, యువకులకు ఆదర్శ ప్రాయుడిగా సీఎం కేసీఆర్ నిలిచాడన్నారు. ప్రజల గుండెల్లో నేడు సీఎం కేసీఆర్ చిరకాల ఆత్మీయబంధువుగా నిలిచాడన్నారు. అనంతరం తూప్రాన్, మల్కాపూర్ గ్రామాల్లో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.