హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో విద్యుత్తో నడిచే వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ మరో అవుట్లెట్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని నాగోల్ ఎక్స్రోడ్లో ప్రైడ్ మోటర్స్తో కలిసి ఏర్పాటు చేసింది సంస్థ. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ బిజినెస్ అధికారి రవ్నీత్ సింగ్ ఫోకేలా మాట్లాడుతూ… తొలి అవుట్లెట్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో నాలుగింతల వృద్ధి నమోదైందని, ఇటీవల కాలంలో ఈవీలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నదన్నారు. రాష్ట్రంలో విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పుంజుకుంటున్నదని, దీంతో త్వరలో వరంగల్, ఖమ్మంలలో కూడా రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. చార్జింగ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో 17 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించగా..త్వరలో మరో 10 స్టేషన్లను ఏర్పాటుచేయబోతున్నది కూడా. ప్రస్తుతం సంస్థ రూ.1,46,926 విలువైన ఏథర్ 450 ఎక్స్, రూ.1,27,916 విలువైన ఏథర్ 450 ప్లస్ స్కూటర్లను హైదరాబాద్లో విక్రయిస్తున్నది.