దుబ్బాక, జూలై 6: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డిని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సోమవారం హైదరాబాద్లో రేవంత్రెడ్డిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దుబ్బాక-హబ్షీపూర్ రోడ్డు విస్తరణ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవనం, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కె ట్ భవనం, చేగుంటలో డిగ్రీ కళాశాల భవనం, నియోజకవర్గంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు , పెండింగ్లో ఉన్న మల్లన్న సాగర్ ఉపకాల్వల నిర్మాణం, నీటి పారుదల శాఖ సంబంధించిన పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి, కిషన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.