హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరుగనుంది. వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. అదేవిధంగా రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ, రవాణా, పౌరసరఫరాలు, హోంశాఖ పద్దులపై చర్చజరుగనుంది. సభ్యుల సందేహాలను మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు మూడోసారి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. బుధ, గురువారాల్లో బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయింపులపై సభ్యుల చర్చించారు.