న్యూఢిల్లీ: ఆసియా కప్(Asia Cup)లో భాగంగా పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ దుమాల్ తెలిపారు. ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్కు ఇండియా వెళ్లడం లేదన్నారు. దర్బన్లో జరుగుతున్న ఐసీసీ ప్రతినిధుల సమావేశంలో దుమాల్ పాల్గొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రేపు ఐసీసీ బోర్డు మీటింగ్ జరగనున్నది. ఆసియా కప్ షెడ్యూల్ను కూడా ఫైనలైజ్ చేశారన్నారు. లీగ్ స్టేజ్లో పాకిస్థాన్లో నాలుగు మ్యాచ్లు ఉంటాయని, ఆ తర్వాత శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఇండియాక్, పాక్ మ్యాచ్లన్నీ డంబుల్లాలో జరిగే అవకాశాలు ఉన్నాయి. 2010 ఎడిషన్లో కూడా ఇలాగే మ్యాచ్లు జరిగాయి. కేవలం నేపాల్తో మాత్రమే పాక్ తన స్వదేశంలో మ్యాచ్ ఆడనున్నది.