న్యూఢిల్లీ : ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చార్రిక ప్రదేశాల్లోని స్మారక చిహ్నాలు, మ్యూజియాలను బుధవారం నుంచి పర్యాటకుల కోసం తిరిగి తెరువనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ చార్రిత్మక ప్రదేశాలన్నీ ఏప్రిల్ 16న మూతపడ్డాయి. కొవిడ్ -19 కేసుల పెరుగుదల తర్వాత అన్ని కేంద్ర స్మారక చిహ్నాలు, మ్యూజియంలను మూసివేయాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి మేలో దేశంలో కరోనా కేసులతో పాటు భారీగా మరణాలు అకస్మాత్తుగా పెరింగింది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 16 నుంచి స్మారక చిహ్నాలను తిరిగి తెరిచేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. అయితే, కొవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించి వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్తో పాటు ఢిల్లీలోని కుతుబ్మినార్, లక్నో సర్కిల్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలను తెరచుకోనున్నాయి.