హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఏఎస్సై మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగిఉన్న ఇసుక లారీని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో అందులో ఏఎస్సై హరిలాల్ (ASI Harilal) తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఏఎస్సై హరిలాల్ మరణించారు.