ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. అందులో భాగంగా పల్లె వైద్యంపై దృష్టి సారించి, సేవలను
మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రతి ప్రభుత్వ పథకాన్నీ ఇంటింటికీ చేరవేస్తూ.. గ్రామీణుల ఆరోగ్య సమాచారాన్ని రికార్డు చేసే ఆశ కార్యకర్తల భాగస్వామ్యాన్ని గుర్తించింది. వారి సేవలను డిజిటలైజేషన్ చేసి.. మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,380 మంది ఆశ కార్యకర్తలు ఉండగా, వారందరికీ పంపిణీ చేసింది. ఇక నుంచి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు కానుండగా, వ్యాధిగ్రస్తులకు సత్వర సేవలందే అవకాశమున్నది.
విద్యానగర్, మార్చి 11: ప్రజారోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక రకాల కార్యక్రమాలను చేపడుతున్నది. అందులో భాగంగా పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలో అన్ని రకాల వసతులను కల్పిస్తూ, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచింది. దీంతో ప్రతినిత్యం ప్రజలకు చేరువగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటా చేరేలా ఆశ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు రూపొందించిన రికార్డుల నమోదు ప్రక్రియ ద్వారా ఆశ కార్యకర్తలకు పని భారం కావడంతోపాటు కొంత సమయాభావం ఇబ్బందిగా మారింది. దీంతో ఉన్నతాధికారులకు నివేదికలు కావాల్సినప్పుడు జాప్యం జరుగుతున్నది. వీటని అధిగమించేందుకు ఆశ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ పోన్లను అందిస్తున్నది. దీంతో ఇక ఏ ఆరోగ్య సమాచారమైనా సులువుగా తెలుసుకునే వీలు కలుగనుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందించారు. ఇక ప్రజారోగ్య సమాచారమంతా ఆశ కార్యకర్తలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు.
గ్రామీణ స్థాయి నుంచి ఏఎన్ఎంలకు అనుబంధంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖలో వారు కీలకంగా మారారు. ప్రస్తుతం వారు నిర్వహించే సేవలకు సంబంధించి 8 రకాల రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇందులో పలు రికార్డులు ఆన్లైన్లో కూడా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం వారు ప్రైవేట్ నెట్ సెంటర్లపై ఆధారపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నది.
ఆశ కార్యకర్తలు తమ సేవలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 69 పీహెచ్సీలుండగా, 483 హెల్త్ సబ్సెంటర్లున్నాయి. జిల్లాలో ప్రతి సబ్సెంటర్ పరిధిలో 2380 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజూ నిర్వహించే ఆరోగ్య సేవలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ఏఎన్ంలకు సహాయకులుగా పనిచేస్తున్నారు. దీంతో ఆశ కార్యకర్తలు 8రకాల రికార్డులను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రతి సబ్సెంటర్ పరిధిలో ఇమ్యునైజషన్, ఏఎన్సీ, పీఎన్సీ సేవలు, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్, హైరిస్క్ కేసులు, టీబీ, బీపీ, షుగర్ బాధితులు, విలేజ్ హెల్త్, న్యూట్రిషన్డే, విలేజ్ శానిటేషన్ డే, కరోనా వ్యాక్సినేషన్, కేసీఆర్ కిట్ల పంపిణీ, గర్భిణుల వివరాల నమోదు, వ్యాధి నిరోధక పద్ధతులు, దంపతులు అవలంబిస్తున్న తీరు తదితర సేవలను నిత్యం అందిస్తున్నారు.
ఆశ కార్యకర్తలు సేవలన్నీ వారికందించిన స్మార్ట్ ఫోన్ల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమో దు చేయనున్నారు. అందులో రూపొందించిన యాప్ల ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆశ కార్యకర్త సేవలన్నీ డిజిటలైజేషన్ కానున్నాయి. సమాచారం అం తా ఆన్లైన్ కావడంతోపాటు అవసరమైనపుడు ఒక్క క్లిక్ చేయడంతో ఏసమాచారమై నా సెకన్లలో ముందుంచేందుకు వీలుపడనుంది.
ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నది. అందులో భా గంగా నిత్యం గ్రామీణ స్థాయిలో ప్రజలకు అం దించే సేవలు డిజటలైజేషన్ చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలో 477 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందిం చాం. వారు అందిస్తున్న సేవలన్నీ ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఆరో గ్య సమాచారం నిక్షిప్తం చేయడంతో జిల్లా స్థాయి లో సమాచార సేకరణ సులువుకానున్నది. – సుమన్మోహన్రావు, జిల్లా వైద్యాధికారి, రాజన్న సిరిసిల్ల