రామారెడి, నవంబర్ 26: సంతత ధారాభిషేకం, కార్తీకమాసం సందర్భంగా కాలభైరవుడి సన్నిధిలో భక్తులు లక్ష దీపార్చన చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లీ-రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడోరోజు శుక్రవారం అఖండ దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బెజుగం మలాతి దంపతులు, ఈవో శ్రీరాం రవీందర్ ప్రారంభించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్షదీపార్చనలో పాల్గొన్నారు. ఎంపీపీ దశరథ్రెడ్డి, సర్పంచులు బాలమణి, సంజీవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్గౌడ్, ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.