సుబేదారి, నవంబర్ 29: ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.05 కోట్లతోపాటు 7 సెల్ఫోన్లు, 43 బ్యాంకు ఖాతా పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సీపీ తరుణ్జోషి కథనం మేరకు.. హనుమకొండ విజయనగర్కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ 2016లో హైదరాబాద్ హఫీజ్పేటలో దుస్తుల వ్యాపారం చేసేవాడు. అక్కడ స్నేహితులతో కలిసి క్రికెట్ బెట్టింగ్ మొదలుపెట్టాడు. 2018లో ముంబై కేంద్రంగా నడిచే ఆన్లైన్ బెట్టింగ్ బుకీ అభయ్విలాస్రావు పెట్కర్ను పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాల్లో బుకీగా మారాడు. లావాదేవీల కోసం బంధువుల పేర్లతో 43 బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశాడు. 2019లో హైదరాబాద్ పోలీసులు వీరిద్దరిని అరెస్ట్చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రసాద్ హనుమకొండ విజయనగర్కాలనీ నుంచే బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేశా డు. ఇటీవల బెట్టింగ్లో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో సెంట్రల్జోన్ డీసీపీ పుష్ప ఆధ్వర్యంలో ఇద్దరు బుకీలను పట్టుకున్నారు.