కందుకూరు: రేషన్ కార్డు దారులనుంచి బియ్యం సేకరించి అక్రమంగా రైస్ మిల్లులకు తరలిస్తున్నయజమానితో పాటు ఇరువురు డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ లిక్కి క్రిష్ణంరాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం ఆలంపల్లి సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు దారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ బియ్యాన్ని రైస్ మిల్లులకు విక్రయిస్తుంటాడు.
సోమవారం కూడా 6550 కిలోల బియ్యాన్ని రెండు బొలేరా వాహనాల్లో తుక్కుగూడ మున్సిపాలిటిలో గల రైస్ మిల్లులకు తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు సీఐ క్రిష్ణంరాజు, ఎస్సై స్వామి పోలీసులు వెంకటేశ్వరకాంట వద్ద ఆపి తనిఖీ చేసి డైవర్లు, ఇస్లావత్ విజయ్, గణమోని వంశీలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు చెప్పారు.
సివిల్ సప్లయ్ నాయబ్ తహసీల్దార్ హైదర్అలీ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6550 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెండు బొలేరా వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే యాజమాని ఆలంపల్లి సత్యనారాయణ తో పాటు డ్రైవర్లు విజయ్, వంశీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎవరైన రేషన్ బియ్యాన్ని అమ్మిన కొన్న చట్టరీత్య చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణంరాజు హెచ్చరించారు.