శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘ఒక తీయని మాటతో..’ అనే పాటను మంగళవారం విడుదల చేశారు. నాయకానాయికల ప్రణయభావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట చక్కటి ఫీల్తో సాగింది. చైతన్యప్రసాద్ సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని శశ్వత్సింగ్, శ్రేయా అయ్యర్ ఆలపించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ స్వరాల్ని అందించారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తేజ మార్ని.