మంచిర్యాల : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్( Balka Suman) బెయిల్ పిటిషన్ ( Bail Petition,) రేపటికి వాయిదా పడింది . మంచిర్యాల జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్పై గురువారం మరోసారి వాదనలు జరిగాయి. బాల్కసుమన్ తరపున న్యాయవాది లలిత వాదించారు. బాల్క సుమన్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల వాదనలు గట్టిగా వినిపించామని ఆమె వెల్లడించారు.
కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉండడం వల్ల బెయిల్ పిటిషన్పై వాదనలు చేయమని పేర్కొంటూ రేపటికి వాయిదా వేశారు. లంచ్ మోషన్ తరువాత కస్టడి పిటిషన్పై విచారణ కొనసాగనుంది.బాల్క సుమన్ అరెస్టులో పోలీసులు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించ లేదని,క్యాతనపల్లి ఘటనలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నదని న్యాయవాది లలిత అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఎన్నికల సమయంలో బాల్కసుమన్, బీఆర్ఎస్ నాయకులపై కేసులు విధించి జైలులో పెట్టారు.