న్యూఢిల్లీ : సెప్టెంబర్ 26 నుంచి తమ అఫిషియల్ వెబ్సైట్పై దివాళీ సేల్ ఆరంభమవుతుందని టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. వచ్చే వారం నుంచి తమ సేల్ ఆఫర్స్ వెబ్సైట్పై లైవ్లో ఉంటాయని వెల్లడించింది. సేల్ సందర్భంగా డీల్స్, డిస్కౌంట్ల వివరాలను యాపిల్ వెల్లడించకున్నా లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్స్ ఉంటాయని తెలిపింది. ఐఫోన్ల కొనుగోలుపై యాపిల్ ఫ్రీ గిఫ్ట్లను ఆఫర్ చేయవచ్చని భావిస్తున్నారు. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీపై ఫ్రీ ఎయిర్పాడ్స్ను యాపిల్ ఆఫర్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది ఐఫోన్ 12, దాని మినీ వెర్షన్ కొనుగోలుపై యాపిల్ ఫ్రీ ఎయిర్పాడ్స్ను ఆఫర్ చేసింది. 2020లో కూడా ఐఫోన్ 11 సిరీస్పై ఈ తరహా ఫెస్టివ్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఏడాది కూడా ఈ తరహా ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఐఫోన్లపై యాపిల్ ఫ్లాట్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ సందర్భంగా ఐఫోన్ 13 ధరను కంపెనీ ఇటీవల తగ్గించడంతో మరింత డిస్కౌంట్ను యాపిల్ ప్రకటిస్తుందని ఆశించడం లేదు.
బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఐఫోన్ 13 ప్రస్తుతం 69,900 పలుకుతుండగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఈ మొబైల్ను రూ 56,990కి కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22న ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్ రూ 48,000కు విక్రయించగా మళ్లీ ధర రూ 56,990గా చూపడంతో ఇది పరిమిత కాల ఆఫర్గా భావిస్తున్నారు. ఇక అమెజాన్లో ఐఫోన్ 12 రూ 42,999కి విక్రయించగా అదే ఫోన్ ఇప్పుడు రూ 44,999కి సేల్లో ఉంది.