అయోధ్య: అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals) గ్రూపు ఇవాళ ఓ ప్రకటన చేసింది. అయోధ్యలో మల్టీ స్పెషాల్టీ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు చెప్పింది. అక్కడ అన్ని రకాల అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉంటాయని అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ నుంచి మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులు అన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. 24 గంటలూ తమ సెంటర్లో వైద్య సేవలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పిల్లలు, పెద్దలకు ఐసీయూ బ్యాకప్ కూడా ఉందన్నారు. అయితే ఆ ఆస్పత్రికి చెందిన నిర్మాణ పనులు త్వరంలో ప్రారంభంకానున్నాయి. సుమారు 5వేల చదరపు అడుగుల స్థలంలో ఆస్పత్రిని నిర్మించనున్నారు.