AP ICET results : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 91.41 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో ర్యాంక్ కార్డులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఐసెట్ ఫలితాలను వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. కాగా ఏపీ ఐసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.