అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై ఏపీ హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు సభ్యుల నియామకంపై జారీ అయిన జావోను సవాల్ చేస్తూ.. బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. పిటిషన్ తరఫున న్యాయవాది అశ్వినికుమార్ వాదనలు వినిపించారు. టీటీడీ ఎంసీఐ చైర్మన్ కేతన్ దేశాయ్ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ధర్మాసనం టీటీడీ ఈవో, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు 18 మందికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆగస్ట్లో ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలకవర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంతో పాటు పలువురిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.