హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎంసీఐ మాజీ చైర్మన్ డాక్టర్ కేతన్ దేశాయ్ నియామకంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.