హైదరాబాద్, ఆగస్టు 9: అమెరికాకు చెందిన డిజిటల్, టెక్నాలజీ సేవల సంస్థ ప్యాక్టెరా ఎడ్జ్…హైదరాబాద్లో మరో క్యాంపస్ను ఆరంభించింది. కంపెనీ సీఈవో వెంకట్ రంగాపురం మంగళవారం ఈ సెంటర్ను లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాదిన్నరలోగా మరో 1,500 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లో ఉన్న సెంటర్లలో 1,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తునానరు. కేవలం ముగ్గురు ఉద్యోగులతో 2018లో హైదరాబాద్లో ఆఫీస్ను ఆరంభించిన సంస్థ అనతి కాలంలో 1,500 మందికి పెంచుకున్నదన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో మరో క్యాంపస్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.