కోయిలకొండ, డిసెంబర్ 5 : మండలంలోని శేరివెంకటాపూర్లో ఆదివారం ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాగులో గంగామాతకు పూజలు నిర్వహించి ఆలయంవరకు పల్లకీసేవ, జల్దిబిందె ఊరేగింపు చేపట్టారు. అనంతరం స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జల్ది ఉ త్సవంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పా ల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదా న కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ సంస్థ చైర్మన్ ఎస్.రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, రైతుబంధు సమితి కన్వీనర్, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మల్లయ్యయాదవ్, నాయకులు భీంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గిరిధారి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, డిసెంబర్ 5 : కార్తీకమాసం ముగింపు సందర్భంగా మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉత్సవ మూర్తులకు పల్లకీసేవ నిర్వహించా రు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మహబూబ్నగర్ రూరల్, డిసెంబర్ 5 : మండలంలోని ఓబ్లాయిపల్లిలో ఆంజనేయస్వామి ఊరేగింపు నిర్వహించా రు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ, వెంకటస్వామి ఉన్నారు.