అమరావతి : ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం యూనివర్సిటీ అధికారులతో ఉన్నతాధికారులు అత్యవసరం సమావేశం నిర్వహించారు.
ఇవాళ రాత్రి నుంచి వర్సిటీ హాస్టళ్లను మూసివేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాలని చీఫ్ వార్డెన్లు నోటీసులు జారీ చేశారు.
దీంతో విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్నారు. వర్సిటీ హాస్టళ్లను హఠాత్తుగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.