రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆర్డర్ టు సర్వ్ అని ఓ ఆర్డర్ ఇచ్చారు. ఎంత అనిశ్చితిని అనుభవించినమో.. ఆ బాధ మాకు తెలుసు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆర్డర్ టు సర్వ్ ఇచ్చేసరికి ఎవరు ఎక్కడ పని చేయాల్నో తెలియని పరిస్థితి. ఇట్లా ఆరేడు నెలలు వృథా చేశారు. ఏపీ అవశేష రాష్ట్రం. రెసిడ్యురీ స్టేట్గా అధికారుల సీనియార్టీని వాళ్లే ఫైనల్ చెయ్యాలి. కానీ ఆర్డీవో సీనియార్టీ ఫైనల్ చెయ్యరు, డీఎస్సీ సీనియార్టీ ఫైనల్ చెయ్యరు. వెయ్యి పోస్టుల దాకా సూపర్ న్యూమరరీ పోస్టులను ఇవ్వాల్సి వచ్చింది. ఎంత విసిగిచ్చినరంటే.. ఆంధ్రా పొసగనివ్వలే. కేంద్రం పరిష్కరించలే. ఉద్యోగస్తుల విషయంలో సీఎస్తోపాటు 14 మంది ఐఏఎస్ ఆఫీసర్ల కోసం క్యాట్కు పోయిన్రు. కోర్టుకు వెళ్లి ఇటు కాకుండా అటు కాకుండా బతకనియ్యకుండా పంచాయితీ చేసినరు. ఇగ మనకు మహత్తరమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది.. మన ఖర్మానికి గొప్ప ప్రభుత్వం ఉన్నది. ఎన్నిసార్లు పోయి చెప్పినమో.. విమాన ఖర్చులే మస్తుగా పెట్టినం. కానీ ఈ వివాదాన్ని మాత్రం పరిష్కరించలేదు. ఇరు రాష్ర్టాల మధ్య వివాదాలను కేంద్రం పరిష్కరించాలి. ఇది వాళ్ల బాధ్యత. కానీ వాళ్లు చెయ్యరు. అయినప్పటికీ.. 1 లక్ష 56 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినం. కొత్తగా 1 లక్ష 12 వేల కొత్త పోస్టులు మంజూరు చేసినం. 1 లక్ష 33 వేల 942 ఉద్యోగాలు భర్తీ చేసినం.
నిజాంరాజు కాలంలో మూసీనది పొంగితే.. హైదరాబాద్కు వరదలొచ్చాయి. అప్పుడు నిజాం ఏం చేద్దామని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి సలహా అడిగారు. గండిపేట, హిమాయత్సాగర్ రెండు చెరువులు తవ్వించాలని నిజాంకు సూచించారు. అవి కట్టిన తర్వాత హైదరాబాద్కు వరదబాధ తప్పింది. ఇప్పుడు వ్యవసాయ వర్సిటీ ఉన్నచోట అప్పట్లో నిజాం రాజు.. విశ్వేశ్వరయ్యకు భోజన కార్యక్రమం ఏర్పాటుచేశారు. నిజాం రాజును మంచిపని చేశారంటూ విశ్వేశ్వరయ్య మెచ్చుకొని.. మరో రెండు మంచి పనులు కూడా చెయ్యొచ్చని సూచించారు. ఈ నీళ్లు చాలా మంచివని, అనంతగిరి కొండల నుంచి వస్తయి కాబట్టి హైదరాబాద్కు తాగునీటి కోసం వాడుకోవచ్చని చెప్పారు. అట్లాగే ఇక్కడ మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యొచ్చని చెప్పారు. అప్పటికప్పుడే ఎక్కడైతే భోజనం చేస్తున్నారో అక్కడే ఫర్మానా జారీ చేసి, 5 వేల ఎకరాలు ఇచ్చి అగ్రికల్చర్ కాలేజీని ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్భాగంగా ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో వాటా కావాలని ఏపీ వాళ్లు అడుగుతున్నరు. ఇంతకన్నా దారుణం ఉంటదా? అప్పటి ఆస్తిలో వాళ్లకు వాటా వస్తదంటరు. వాళ్ల వాదన ఎంత అర్థరహితంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ హాస్పిటల్ పైనా ఇదే లొల్లి. కార్మికులకు దగ్గరుండేలా ఉస్మానియా యూనివర్సిటీ భూమిని తీసుకొని తార్నాకలో ఏర్పాటుచేశారు. అది ఇప్పుడు కూడా యూనివర్సిటీ భూమే. దీంట్లోనూ వాటా కావాలంటరు. ఇందులో ఏమైనా అర్థమున్నదా? ఈ భూములన్నింటికీ ఓ చరిత్ర ఉన్నది. అవన్నీ తెలంగాణ ఆస్తులని చెప్పినా వాళ్లు వినకుండా కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెడుతూ పంచాయితీ తెగనియ్యలేదు.
గత పాలకులు కాంట్రాక్ట్ పద్ధతని చెప్పి ఉద్యోగుల కడుపు మాడ్చిన్రు. ట్రాన్స్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేపిచ్చిన్రు. కాంట్రాక్ట్ ఉద్యోగం కడుపుకొట్టే పని. అసలు ఉద్యోగికంటే ఎక్కువ పనిచేస్తడు. తక్కువ జీతమిస్తరు. ఇంతకంటే దోపిడీ ఇంకేమన్న ఉన్నదా? అందుకే తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగమన్నదే ఉండదు. విద్యుత్తు శాఖలో 22,722 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినం. వాళ్లంతా ఇప్పుడు సంతోషంగా ఉంటున్నరు. ఆంధ్రా పాలకులు తెలంగాణ యువతను అన్నివిధాలా దగా చేశారు. గతంలో 25 శాతం నాన్లోకల్ కోటా అని ఉండేది. అసలు నాన్లోకల్ అనేదే ఒకటి ఉండేది కాదు. కానీ ఆ పేరు చెప్పి మనల్ని దోచుకొన్నరు. కొన్నింటికి ప్రత్యేకంగా సొసైటీలు అని పేర్లు పెట్టిన్రు. ఆ సొసైటీలకు ఉత్తర్వులు వర్తించవు. అట్ల కూడా వాళ్లకు నచ్చినోళ్లకే ఉద్యోగాలు ఇచ్చుకొన్నరు. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాలని మేం భావించినం. అందుకే కాంట్రాక్ట్ పద్ధతి అనే వ్యవస్థనే తెలంగాణ నుంచి తుడిచేసినం.