హైదరాబాద్, మార్చి 31 (నమస్తేతెలంగాణ) ః నేర చరిత్ర కలిగిన వ్యక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వారిని నియమించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వానికి ఏదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్టు భావిస్తున్నామన్న ధర్మాసనం, అందరినీ తొలగించకపోయినా కొందరినైనా తొలగించాలని సూచించింది. విధానపరమైన నిర్ణయం అయినందున దీనిని సమర్థిస్తున్నట్టు హైకోర్టు పేర్కొన్నది.