అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారుఅనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటిలో వేసే చుక్కల మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగనున్నది. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనున్నది న్యాయస్థానం. ఏపీ సర్కారు ఇప్పటికే ఆనందయ్య మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాలు ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు ఇవ్వొచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి తయారీకి ఆనందయ్య సిద్ధం అవుతున్నారు.