రాజాపూర్, నవంబర్ 16 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ దళారీరాజ్యం వస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి, బీబీనగర్, చంద్రీగానితండా, యారోనిపల్లి, నాన్చెరువుతండా, ఈద్గాన్పల్లి, మల్లెపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎర్రశేఖర్తో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వాహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన లక్ష్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రాష్ట్రంలో దళారీలు రాజ్యం ఏలేవారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అధికారం కట్టబెడితే చేసింది శూన్యమన్నారు. గతంలో రైతులు ఎరువులు, విత్తనాలు, కరెంట్ కోసం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ నా యకుల మాటలు నమ్మి కర్ణాటక ప్రజలు తీవ్రంగా మోసపోయారని, మనం ఆ తప్పు చేయకుండా అభివృద్ధిని చూసి ఆదరించాలని కోరారు. గ్రామాల్లో ఊహించని అభివృద్ధి చేశామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉందన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇస్తామాని పలు గ్రామాల ప్రజలు తెలిపారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, మార్కెట్ కమిటీ డైరక్టర్లు నారాయణరెడ్డి, కృష్ణయ్య, శ్రీశైలం, యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచులు రాఘవేందర్రెడ్డి, గోవింద్నాయక్, సీవ్లీ, అలువేలు, నాయకులు మహిపాల్రెడ్డి, ఆనంద్గౌడ్, వెంకట్నాయక్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.