మంచిర్యాల అర్బన్, మార్చి 18 : యువ శాస్త్రవేత్తలకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి అవకాశం కల్పించింది. ఇందుకోసం వేసవి సెలవుల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ‘యువికా-2022’ రెసిడెన్షియల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 16 నుంచి 28 వరకు రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఎం పికైన 150 మంది విద్యార్థులతో ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలను పంచుకోవడం, చర్చించడం, ప్రయోగాత్మక ప్రదర్శన, ల్యాబ్ల సందర్శనలు, చ ర్చల కోసం ప్రత్యేక సెషన్లు , అలాగే నిపుణులతో ప్రాక్టికల్స్, ఫీడ్బ్యాక్ సెషన్లు జరుగుతాయి. ఎంపిక కోసం విద్యార్థులు వెబ్సైట్ (www.isro. gov. in) లో పేర్లు, వివరాలను నమోదు చేసుకోవాలి.
గతంలో జిల్లాకు చెందిన 48 మంది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు రెండు రోజుల పాటు ఇస్రో అంతరిక్ష కేందాన్ని సందర్శించారు. రెండు ఉపగ్రహ ప్రయోగ వేదికలను (లాంచ్ఫ్యాడ్స్) పరిశీలించా రు. ఉపగ్రహాలను ఎలా పంపుతారు, ముందుగా ఎలా పరీక్షిస్తారు తదితర విషయాలను శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు యువికా రూపంలో ఆ అవకాశం లభించింది.
‘యువికా-2022’ పోటీలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా కింది నిబంధనలకు లోబడి నిర్వాహకులు ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన విద్యార్థులకు దేశంలోని ఇస్రోకు చెందిన ఐదు కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) తిరువనంతపురం, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ) బెంగళూరు, స్పేష్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) హైదరాబాద్తో పాటు ఈశాన్య స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్ఈ-ఎస్ఏసీ) షిల్లాంగ్లో పర్యటించనున్నారు. అలాగే ప్రాజెక్టు ముగింపులో విద్యార్థులను శ్రీహరికోటలోని సతీ శ్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తారు. మొత్తం ఖర్చు లు, కోర్సు మెటీరియల్, లా డ్జింగ్, బోర్డింగ్ తదితరాల ఖ ర్చును ఇస్రోనే భరించనున్నది.
యువికా – 2022 నమోదు ప్రక్రియ నాలుగు ద శలుగా ఉంటుంది. అభ్యర్థులు ప్రతి దశలో జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. క్విజ్ని ప్రయత్నించకుండా, సర్టిఫికెట్లను అప్లోడ్ చేయకుండా అసంపూర్తి అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోరు.
స్టెప్ 1 :యువికా-2022 కోసం ఈ-మెయిల్ నమోదు
స్టెప్ 2 : క్విజ్ సూచనలు చదవడం, ఈ-మెయిల్లో 48 గంటల్లోపు ఆన్లైన్ క్విజ్లో కనిపించాలి.
స్టెప్ 3 : క్విజ్ అప్లోడ్ చేసిన గంట తర్వాత కనీసం యువికా పోర్టల్లోకి లాగిన్ కావాలి. మొత్తం సమాచారాన్ని సరిగా నమోదు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని సమర్పించిన అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 4 : రిజిస్ట్రేషన్ చివరి తేదీకి ముందు సంతకం చేసిన కాపీ, అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 10 సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఆ యా పాఠశాలల హెచ్ఎంలు ప్రోత్సహించాలి. అదే నెల 20 న ఎంపిక జాబితా ప్రకటిస్తారు. మే 16 నుంచి 28 వరకు ఎంపికైన విద్యార్థులు ఐదు కేంద్రాలను సందర్శిస్తారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు (98495 50200) ను సంప్రదించాలి.
– వెంకటేశ్వర్లు, డీఈవో మంచిర్యాల