న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 22వ తేదీన జరిగింది. అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఫిర్యాదు ఇచ్చినట్లు ఎయిర్ ఇండియా పేర్కొన్నది.
నిజానికి ఆ వ్యక్తిపై చర్యను తీసుకోవాలని విమానంలోని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళా ప్యాసింజెర్.. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్కు లేఖ రాశారు. ఆ తర్వాతే ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.
భోజనం తర్వాత లైట్లను డిమ్ చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్యాసింజెర్ మూత్రం పోయడం వల్ల తన దుస్తులు, బ్యాగ్, షూ తడిసినట్లు ఆమె ఆరోపించారు. విమానం సిబ్బంది తనకు దుస్తుల్ని, చప్పులను ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఫస్ట్ క్లాస్లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా.. సిబ్బంది సీటులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.