న్యూఢిల్లీ: ప్లాస్టిక్ స్ట్రాలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అముల్ సంస్థ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధాన్ని వాయిదా వేయాలని అముల్ సంస్థ తన లేఖలో ప్రధానిని కోరింది. ఏడాది పాటు నిషేధాన్ని వాయిదా వేయాలని అముల్ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీ తన లేఖలో కోరారు. తక్షణమే స్ట్రాలను బ్యాన్ చేయడం వల్ల రైతులు, పాల వాడకంపై ప్రభావం పడుతుందని అముల్ సంస్థ ఎండీ అభిప్రాయపడ్డారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అముల్ సంస్థ తన ప్రొడక్ట్స్ అన్నింటికీ ప్లాస్టిక్ స్ట్రాలను వాడుతుంటుంది. ఈ నేపథ్యంలో స్ట్రాల నిషేధాన్ని వాయిదా వేయాలని ఆ సంస్థ కోరింది. అముల్తో పాటు పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.